అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గురువారం ఊహించని విధంగా పడిపోయింది. మునుపెన్నడూ లేని విధంగా 120 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఈ పరిణామంపై విద్యుత్ ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించారు.
► రాష్ట్రవ్యాప్తంగా గురువారం వీచిన గాలులు, వర్షానికి పలు జిల్లాల్లో భారీగా విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.► వర్షం కారణంగా రైతులు కూడా వ్యవసాయ విద్యుత్ ఉపయోగించుకోలేదు.